జాఫర్ ఎక్స్ ప్రెస్ ను మరోసారి టార్గెట్ చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు
x
జాఫర్ ఎక్స్ ప్రెస్

జాఫర్ ఎక్స్ ప్రెస్ ను మరోసారి టార్గెట్ చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు

పట్టాలపై ఐఈడీ, గుర్తించి నిర్వీర్యం చేసిన పాక్ సైన్యం


పాకిస్తాన్ మొత్తాన్ని దాదాపు చుట్టి వచ్చే ప్యాసింజర్ రైలు అయిన జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని నసీరాబాద్ ప్రాంతంలో షెషావర్ వెళ్తున్న రైలు పట్టాలపై ఐఈడీ అమర్చినట్లు పాకిస్తాన్ టీవీ ఛానల్లు వార్తలు ప్రసారం చేశాయి.

రైలు మార్గంలో గుర్తు తెలియని వస్తువులు ఉన్నాయనే సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన భద్రతా దళాలు సంబంధిత బాంబును నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.

దాదాపు నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రైలుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగింది. అప్పడు రైలు సురక్షితంగా ఈ గండం నుంచి బయటపడింది. కొన్ని నెలల ముందు బలూచ్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దాదాపు రెండోందల మంది పాక్ సైనికులను తమ ఆధీనంలోకి తీసుకుని వారిని హతమార్చింది. అయితే యధావిధిగా పాక్ మాత్రం ఎలాంటి సైనికులు బందీలుగా చిక్కలేదని, ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది.

రైలు మార్గంలో భద్రతా కారణాల రీత్యా జకోబాద్ లో నిలిపివేశారు. మరో రైలును సర్వీస్ ను నిలిపివేసిన తరువాత మొత్తం ట్రాక్ ను పరిశీలించడానికి రైల్వే శాఖ సమాయత్తమైంది.
ఆ తరువాత రైళ్లు నడపడానికి అనుమతి ఇస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బలూచ్ తిరుగుబాటుదారులు సహ అనేక ఉగ్రవాద సంస్థలు దాడులు చేస్తుంటాయి. ఈ రైల్ సేవలను ఎక్కువగా పాక్ సైనికులు ఉపయోగించుకోవడమే దీనికి కారణం.
మార్చి 11న ఈ జాఫర్ ఎక్స్ ప్రెస్ పై అత్యంత పెద్ద దాడి జరిగింది. బీఎల్ఏ జాఫర్ ఎక్స్ ప్రెస్ పై పెద్ద ఎత్తున దాడికి దిగింది. రెండు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకుంది. తరువాత భద్రతా దళాలు 354 మంది ప్రయాణికులను సురక్షితంగా విడిపించినట్లు పేర్కొంది.
ఈ దాడిలో 33 మంది తిరుగుబాటుదారులు మరణించారు. అక్టోబర్ లో సింధ్ ప్రావిన్స్ లోని రైల్వే ట్రాక్ లో కూడా బాంబు దాడి జరిగింది. ఈ పేలుడు ధాటికి ఐదు రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.


Read More
Next Story