
వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు
లీడ్స్ టెస్ట్: తేలిపోయిన భారత బౌలర్లు
భారత్ కు స్పల్ప ఆధిక్యం, బ్యాట్స్ మెన్ పైనే భారం క్రీజులో రాహుల్, గిల్
లీడ్స్ లో టెస్ట్ లో భారత్ కు ఆధిక్యం ఏం మిగలేదు. బూమ్రా ఐదు వికెట్లు తీసిన మిగిలిన బౌలర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.
బౌలర్లకు తోడు పేలవ ఫీల్డింగ్ కూడా ఇంగ్లీష్ టీమ్ కు వరంలా మారింది. దీనితో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్సింగ్స్ లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కు కేవలం ఆరు పరుగుల ఆధిక్యం లభించింది.
స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్సింగ్స్ లో సెంచరీ చేసిన జైస్వాల్ 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
కార్స్ వేసిన బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ స్థితిలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యాతయుతంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు.
తొలి ఇన్సింగ్స్ లో డకౌట్ అయిన సాయి సుదర్శన్(30) రాహుల్ కు అండగా నిలబడ్డాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రాహుల్ మంచి పుట్ వర్క్ తో సులువుగా పరుగులు సాధించాడు.
మరో వైపు క్రీజులో కుదురుకున్నట్లు కనిపించి సాయి సుదర్శన్ తొలి ఇన్సింగ్స్ తరహాలోనే స్టోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కు ఈ జోడి 66 పరుగులు జోడించింది.
తరువాత వర్షం మొదలవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ (47) కు తోడు కెప్టెన్ గిల్(6) క్రీజులో ఉన్నారు. పిచ్ పేసర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో మన బ్యాట్స్ మెన్ ఎలా పరుగులు సాధిస్తారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
దంచికొట్టిన బ్రూక్స్..
ఓవర్ నైట్ స్కోర్ 209/3 తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తన బజ్ బాల్ వ్యూహం కొనసాగించింది. ముఖ్యంగా బ్రూక్స్ ధాటిగా ఆడాడు. బుమ్రాతో సహ అందరి బౌలర్లను ఉతికి ఆరేశాడు.
మరో వైపు సెంచరీ హీరో ఓలిపోప్ ను ప్రసిద్ధ్ కృష్ణ ను పెవిలియన్ పంపాడు. ఔట్ స్వింగర్ ను ఆడే ప్రయత్నంలో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టోక్స్ క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో సిరాజ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ జేమీ స్మిత్ (40) అండగా నిలబడంతో బ్రూక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కట్, ఫుల్ షాట్లతో బౌండరీలు సాధించాడు. భారత్ బౌలింగ్ లో జడేజా, శార్దూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
అయితే సిక్సర్ తో సెంచరీ సాధించాలనుకున్న బ్రూక్స్ బంతిని గాల్లోకి లేపగా అది శార్దూల్ చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలో భారత్ ఆధిక్యం దక్కుతుందని అంతా అనుకున్నారు.
కానీ టెయిలెండర్లను ఔట్ చేయడంలో తడబడే అలవాటు ఉన్న భారత్ మరోసారి అదే బలహీనతను చాటుకుంది. క్రిస్ వోక్స్ (38), బ్రైడెన్ కార్స్(22) టీమిండియాకు ఆధిక్యం దక్కకుండా చేశారు. ఈ జంట కేవలం 36 బంతుల్లోనే 55 పరుగులు జోడించింది. ఈ రోజు భారత్ బ్యాటింగ్ చేసే సామర్థ్యంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
Next Story