ఆర్జేడీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ
x

ఆర్జేడీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ

‘అభివృద్ధికి ఓటు వేయండి.. రాజవంశానికి కాదు’ - సివాన్ బహిరంగ సభలో ప్రధాని


ప్రధాని మోదీ(PM Modi) బీహార్(Bihar) పర్యటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీహార్‌లో నిన్న (జూన్ 20న) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన సివాన్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో మరో 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసి మాట్లాడారు. ఆర్జేడీ, కాంగ్రెస్ బీహార్ వ్యతిరేకులు. రాష్ట్రం వెనుకబాటుకు ఆ కూటమే కారణం. అభివృద్ధికి ఓటు వేయండి.. రాజవంశానికి కాదు అంటూ పరోక్షంగా ఆర్జేడీకి చురకలంటించారు.

లలూ కౌంటర్..

మోదీ వ్యాఖ్యలకు ఆర్జేడీ(RJD) చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) వెంటనే కౌంటర్ ఇచ్చారు.

"ఈ రోజు, అబద్ధపు, తప్పుడు వాగ్దానాలు వర్షం కురుస్తోంది. ఉరుములతో పాటు, నమ్మశక్యం కాని ఆఫర్ల వడగళ్ళు పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి" అంటూ RJD అధినేత లాలూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని మోదీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు.

రాబోయే వారాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ(NDA) కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉండబోతుందన్నది మాత్రం వాస్తవం.

Read More
Next Story