’’ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నది రౌడీయిజం చేయడానికి కాదు‘‘
x
కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్ మూర్తి, తమిళనాడు అదనపు డీజీపీ జయరామ్

’’ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నది రౌడీయిజం చేయడానికి కాదు‘‘

తమిళనాడు ఎమ్మెల్యేకు తలంటిన మద్రాస్ హైకోర్టు, కిడ్నాప్ కేసులో అదనపు డీజీపీకి సహకరించిన శాసనసభ్యుడు?


మహాలింగం పొన్నుస్వామి

కిడ్నాప్ వ్యవహరంలో తమిళనాడు పోలీస్ శాఖలో అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న జయరామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.

ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కేవీ కుప్పం ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి దర్యాప్తుకు సహకరించాలని జస్టిస్ వేల్ మురుగన్ ఆదేశించారు. ఎమ్మెల్యే గా ప్రజలు ఎన్నుకున్నది రౌడీయిజం చేయడానికి కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం శాసనసభ్యుడికి తలంటింది. కేసు విషయాల్లోకి వెళితే..

ఏడీజీపీ జయరామ్ కుటుంబానికి చెందిన ఓ మహిళను ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ధనుష్ అనే అబ్బాయిని వివాహం చేసుకున్నారు. తరువాత ఈ పెళ్లిని వారు రిజిస్టర్ చేసుకున్నారు.
అయితే యువతి కుటుంబం ఈ వివాహాన్ని అంగీకరించలేదు. దీనితో వారు ధనుష్ ను కిడ్నాప్ చేయడానికి గుండాలు నియమించుకున్నారు. వారు మే 10 ధనుష్ ను కిడ్నాప్ చేయడానికి ప్రణాళిక రచించి, అతడి స్వస్థలమైన తిరువళ్లూర్ లోని కలపక్కం చేరుకున్నారు.
అయితే ధనుష్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి మైనర్ తమ్ముడిని అపహరించారు. తరువాత అతడిని విడుదల చేశారు.
కేసును దర్యాప్తు చేస్తున్న సందర్భంలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు జయరామ్ కారును కిడ్నాప్ కు ఉపయోగించారని ఆయనతో పాటు పురచ్చి భారతం కచ్చి నాయకుడు కేవీ కుప్పం ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి కి ఇందులో భాగం ఉందని తేలింది.
బాధిత కుటుంబం మద్రాస్ హైకోర్టులో కిడ్నాప్ పై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ మూర్తి, జయరామ్ ఇద్దరిని ఒకేసారి విచారణకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మందలించిన న్యాయస్థానం..
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వేలు మురుగన్ ఎమ్మెల్యే జగన్ మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఎమ్మెల్యే కాదా? మీ నియోజకవర్గం మీకు గుర్తుందా? మీరు ఎన్ని ఓట్లతో గెలిచారో మీకు తెలుసా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది రౌడీయిజంలో పాల్గొనడానికి కాదు, వారికి సేవ చేయడానికి’’ అని అన్నారు.
‘‘పోలీసులు దర్యాప్తుకు వచ్చినప్పుడూ సహకరించడం మీ విధి కాదా? పైగా ముందస్తు బెయిల్ కోసం న్యాయమూర్తుల నివాసాన్ని చుట్టుముట్టి ఒత్తిడి చేస్తారా? ఇది సరైన ప్రవర్తనేనా? మీ చర్యలు న్యాయమూర్తిని భయపెడతాయని అనుకుంటున్నారా? ఒక ఎమ్మెల్యే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించకూడదు’’ అని న్యాయమూర్తి చురకలు అంటించారు.
కోర్టు ప్రాంగంలోని పార్టీ కార్యకర్తలతో రావడం వలన ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడిందని, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ జగన్ మూర్తి చర్యలను ఖండించింది. అవసరమైతే జగన్ మూర్తిని విచారించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ముందస్తు బెయిల్ విచారణను జూన్ 26కి వాయిదా వేసింది.


Read More
Next Story