తిరుమల శ్రీవారి ఆలయంలో ముగిసిన  జ్యేష్టాభిషేకం..!
x

తిరుమల శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం..!

తిరుమలలో నేడు పౌర్ణమి గరుడుసేవ


తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు . నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం తొడిగి భక్తులకు దర్శన ఇచ్చారు. అలాగే రెండో రోజు ముత్యాల అంగి తొడుగులో నిన్న స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.


ఇక జ్యేష్టాభిషేకంలో చివరి రోజైనా శ్రీవారికి తిరుమంజనం పూర్తిచేసి ఆ తర్వాత మళ్లీ బంగారు కవచాన్ని తిరిగి సమర్పిస్తారు. ఇలా సమర్పించిన బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే సంవత్సరం జ్యేష్టాభిషేకం సమయంలోనే తొలగిస్తారు. అప్పటి వరకు అంటే ఏడాది పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పల్గొంటారు. ఈరోజు సాయంత్రం మలయప్ప స్వామి బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వమన్నారు.


ఈ నేపథ్యంలో తిరుమల ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.


Read More
Next Story